Monday, January 31, 2011

కధా మంజరి - 2 - విమానం వేంకటేశ్వరుడు

విమానం వేంకటేశ్వర స్వామి

మనం తిరుమల లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీవేంకటేశ్వరుని దర్సించి, పిదప , విమానం లో వున్న వేంకటేశ్వరునికి దండం పెట్టుకుంటాం. ఇది చాలా మంది భక్తులు చేసేదే. అయితే ఇలా యెందుకు పెట్టూకుంటాము అంటే, చాలా మంది వద్ద సమాధానం వుండదు. ప్రతీ గుడి గోపురం మీద ఆ ఆలయం యొక్క మూల విరాట్ స్వరూపం చెక్కబడి వుంటుంది. అలా అని మరి మనం అన్ని ఆలయాలలోనూ, విమానం(గోపురం) లో వున్న వేల్పును కొలవటంలేదు కదా. కేవలం తిరుమల లోనే ఈ ఆచారం వుంది. ఇది యెందుకో తెలుసుకుందాం.

శ్రీకృష్ణదేవరాయలు నాలుగవ సంవత్సరం లోనే రాజ్యాభిషిక్తులు అయ్యారు. ఆయన రాజుగా వున్నప్పుడు, ఆ రాజ్యపు రాజ గురువు వ్యాస తీర్థుల వారు అనుకుంటా) అన్నిటికీ పెద్దగా వ్యవహరించే వారు. తిరుమల ఆలయం వైఖానస ఆగమం ప్రకారం నడపబడే ఆలయం. ఆ కాలంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి, తిరుమల లోని వైఖానసులు అందరూ కూడా మృత్యువాత పడ్డారు. అప్పుడు స్వామి వారు, వ్యాస తీర్థుల వారి కలలో కనిపించి, "ఆలయం లో అర్చకత్వం చేసే అర్హత వున్న వారు యెవరూ లేరూ(అందరూ గతించారు), ఒక మగ శిశువు మాత్రం ఒక తల్లి గర్భం లో వున్నాడు. వాడు పుట్టి, పన్నెండు సంవత్సరాలు వేదం నేర్చుకున్నాక, మల్లి ఆలయం లో పూజదికాలు మొదలుపెట్టండి. అప్పటిదాకా నేను ఆలయ విమానం మీదనే వాసం చేస్తాను" అని శెలవిచ్చారట . ఆ విధంగా, విమానం లో వున్న మూర్తి లోకి స్వామి వారు ప్రవేసించారు. తిరుమల ఆలయం 12 సంవత్సరాలు మూసివేయబడింది. ఆ 12 సంవత్సరాలు కూడా, పూజాదికాలు విమానం లో వున్న స్వామి కే చేయబడినాయి. అందువల్ల,విమానం లొ వున్న స్వామి వారికి ఆ విశిష్తత యేర్పడింది.

********************సశేషం*************************

Tuesday, January 18, 2011

కధా మంజరి - 1.

మా స్నేహితుడు చాలా కాలం నుంచి వ్రాయమని కోరగా, ఇలా ఈ కధల శీర్షిక మొదలు పెడుతున్నా. పౌరాణిక గాధలు చాల మందికి తెలిసినవే, కాకుంటే , ఈ తరం వాళ్ళకి వాటి గురించి పెద్దగా తెలియదు . వారికి తెలియచేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ "కధా మంజరి."

జనక మహారాజు
----------------


జనకుడు అనగానే మనకి గుర్తుకు వచ్చేది సీతా దేవి తండ్రి, మిధిలా నగర మహారాజు, జనక మహరాజు.చాలా మంది దగ్గర "జనక" అనే పదం విన్నాం. జనక అంటే, తండ్రి అని కదా అర్థం .మరి జనకుడికి ఆ పేరు యెందుకు వచ్చిందో చూద్దాం.


పూర్వం "నిమి" అనే ఒక చక్రవర్తి 999 యజ్ఞాలు చెసాడు. సహస్ర(1000) యజ్ఞాలు చేస్తే, ఇంద్ర పదవి లభిస్తుంది. వశిష్తుల వారి ఆధ్వర్యం లొ 999 యజ్ఞాలు చేసిన మహానుభావుడు ఆ నిమి చక్రవర్తి. ఆయన 1000వ యజ్ఞం తలపెట్టగా, ఆ సమయం లో వశిష్తుల వారు దేవ కార్యం మీద దేవ లొకం వెళ్ళటం తటస్థించింది. అప్పుడు నిమి, గౌతమ మహా మునిని,యజ్ఞం చేయించమని ప్రార్థింపగా, ఆయన సంకోచించాడు. అప్పుడు నిమి , పూర్ణ కుంభం వసిష్తుల వారి మీదగానె జరిపిద్దాము అని చెప్పి, యజ్ఞం చేయించటానికి గౌతముల వారిని వొప్పించారు. యాగం మొదలు అయ్యింది.

యజ్ఞం దాదాపు అయిపొయే సమయానికి, వశిష్తుల వారు వచ్చారు. ఆయన ఆగ్రహం పొంది, తాను లేని సమయం లో, ఇంకొక ముని ద్వారా యజ్ఞం జరిపించినందుకు గాను, కోపించి, నిమి చక్రవర్తిని భస్మం అయిపొవలసిందిగా శపించారు. అప్పుడు నిమి తిరిగి వసిష్తుల వారిని కూడా నిర్జీవం కమ్మని శపించారు. ఈ విధంగా ఇద్దరూ మరణించి బ్రహ్మ లోకం వెల్లగా, బ్రహ్మ వారి వాదనలు విన్నాడు. విని, ఇద్దర్నీ క్షమిస్తున్నాను, వరం కొరుకొ మంటాడు. అప్పుడు వసిష్తుల వారు తిరిగి తన శరీరం లోకి ప్రవేశాన్ని కొరుకుంటారు. ఆ విధంగా ఆయన మరల పునర్జీవుతులు అవుతారు.
నిమి మాత్రం తనకి ఇక జీవించే కోరిక లేదు అని, కాని, మానవులకి సాయంగా ,వారి కన్నులని కాపడుతూ వుంటా అని కోరుకుంటాడు. బ్రహ్మ వరం ఇస్తాడు. అప్పటినించి మానవుల యొక్క కను బొమ్మలుగా నిమి చక్రవర్తి వుంటున్నారు. అందుకనే మనుషులను 'నిమిషులు" అంటారు. దేవతలను "అనిమిషులు" అంటారు. అన్నమాచార్యుల వారు వ్రాసిన ఒక పాట గుర్తు చేస్కుంటే,

"అనిమిషేంద్రులు" మునులు దిక్పతులమర కిన్నెర సిద్ధులు...
ఘనతతో రంభాది కాంతలు గాచినారెచ్చరికయా

అని దేవతలను , అనిమిషులుగా సంబొదించారు

ఇక కధలోకి వద్దాం. ఆ రకంగా నిమి కనుబొమ్మ గాను, వశిష్తుల వారు తిరిగి వశిష్తుల వారుగా వెళ్ళిపొయారు. అయితే యాగ శాల లో నిమి చక్రవర్తి యొక్క చితా భస్మం అలానే పడి వుంది. లోక కల్యాణం కోసం చెపట్టిన యజ్ఞం లొ ఇలా మానవ చితా భస్మం వుండకూఉడదు అని,గౌతముడు,ఇత్యాది మునులు అందరూ కలిసి, ఆ భస్మాన్ని చిలికి అందులోంచి ఒక బాలుడిని తీసుకు వచ్చారు. తల్లి ప్రమేయం లెకుండా కేవలం తండ్రి వలనే పుట్టాడు కాబట్టి వాడిని "జనకుడు" అన్నారు.

ఆ విధంగా, మిధిల నగరాధీశులందరికి ఆ నామధేయం వచ్చింది. మనకి తెలిసిన జనకుడి పేరు శీలధ్వజుడు, ఆయన తమ్ముడి పేరు కుశధ్వజుడు.

-సశేషం-