Tuesday, October 30, 2007

jeevitapu samatulyata...జీవితపు సమతుల్యత

ఇప్పటికి చాలా రోజుల క్రితం రాశాను..మళ్ళీ ఇదిగో ఇప్పుడు రాస్తున్నాను....అప్పటికి , ఇప్పటికి ఒక్కటే తేడా, పని చేస్తున్న సంస్థ మారాను..ఇప్పుడు నేను ఓరాకల్ అనే సంస్ఠలొ పని చేస్తున్నాను..ఇక్కడికి వచ్చిన తరవాత కాని తెలియలేదు, యే రాయి ఐనా ఒకటే పళ్ళు ఊడగొట్టుకోటానికి అని..
జీవితం సాఫీగానే సాగిపొతోంది..చేతనైనంత వరకు పక్క వాళ్ళకి సాయం చేయటానికి ప్రయత్నిస్తున్నా...ఇదేంటీ, సొంత డబ్బా అంటారా..సరే..ఇంకో విషయానికి వద్దాం..


నేను నాతొ పనిచేసే వాళ్ళలో కొంత మందిని చుస్తున్నా, వాళ్ళు, పొద్దున్నే కార్యాలయానికి వస్తారు, రాత్రి పది, పదకొండు అయినా ఇళ్ళకు వెళ్ళరు...ఎందుకంటే, వాళ్ళు త్వరగా సంస్థలో ఎదగాలి అని చూస్తున్నారు..
వాళ్ళను చూసి ముందు భయం వేసింది, తర్వాత బాధ వేసింది...భయం ఎందుకు వేసింది అంటే, అమ్మో, వీళ్ళ మధ్యలో మనం పని చెయగలమా..వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటే, మనం వీళ్ళతో పోలిస్తే ఎంతా అని.....బాధ ఎందుకు వేసింది అంటే, ఆలొచించగా, నాకు ఇలా అనిపించింది,...

విపరీతంగా కష్టపడి, మనం ఎదిగామే అనుకోండీ, దాని వల్ల మనం పొందింది ఎంటి? సంస్ఠలొ ఎదుగుదల,మరి కొల్పొయింది యేమిటి? మన జీవితంలోని కొన్ని అత్యుత్తమ క్షణాలు...
ఎందుకలా అంటే, ఒక్క సారి ఆలొచిద్దాం..ఇంటి దగ్గర, మనకోసం, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, మనతో మాట్లాడదాము అనుకుంటుంది, మనమేమో అర్థరాత్రి వెళ్తాము..అప్పటికి అమ్మ నిద్ర పోతుంది...

తెల్లవారేక హడావిడి..అమ్మా తొందరగా వెళ్ళాలి, మా మేనేజెర్ తో మాట్లాడాలి, అంటూ మన అరుపులు.....అరెయ్ వంశీ నీతొ కొంచం మాట్లాడాలిరా అని అమ్మ అంటుంది.,..మనమేమో రాత్రికి కి వచ్చి మాట్లాడదాము అని వెళ్ళిపోతాము..

మళ్ళీ యధా ప్రకారం రాత్రి ఆలశ్యం..ఇలా కొన్ని రోజులు పోయాక, మనకి, మన ఇంట్ళో వాళ్ళకీ, మాటలు కూడా కరువు అవుతాయి....రెండు సంవత్సరాలు గడుస్తాయి, మనకి సంస్ఠలో ఎదుగుదల వస్తుంది, కాని అప్పటికి, మనం ఆ ఆనందాన్ని పంచుకుందామంటే మనం ఆశించిన రీతిలొ ఇంట్లో వాళ్ళు స్పందించక పోవచ్చు..లేదా అసలు వాళ్ళు లేకపోనూవచ్చు. అప్పుడు మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదు..

కావాలంటే మళ్ళీ ప్రొమొషన్ తెచ్చుకోవచ్చు, పోయిన క్షణాలని, అనుభూతులని తెచ్చుకోగలమా?
...మరి ఈ రెండు సంవత్సరాలు వాళ్ళతో మనం గడిపితే, రెండు సంవత్సరాలకి రావల్సిన ప్రొమొషొన్, మూడు సంవత్సరాలకి వస్తుంది..దాని వల్ల, మనకి ఎమన్నా నష్టమా? లేదే? మరి ఎందుకు ఇలా మన జీవితాలను ఆఫిసులకి అంకితం చేసుకుని, మన జీవితాలను మనం మర్చిపొతున్నాం?మనం లేకపోతే పని జరగదూ అనేది వొట్టి మాట,,,

మనం లేనప్పుడూ ఈ సంస్థలు ఉన్నాయి, మనం వెళ్ళిన తర్వాత ఈ సంస్థలు ఉంటాయి...మనం కేవలం సాగే నీరు లాటి వాళ్ళం...మన జీవితమే మనకు ప్రధానం.
పని బాగా చెయ్యాలి, ఎకాగ్రతతో , నమ్మకంగా పని చెయ్యాలి..కాని, మనకోసం ఆలొచిస్తూ ఇంట్ళొ ఒకళ్ళు ఉన్నారని, వాళ్ళని సుఖబెట్టడం మన ధర్మమని కూడా మనం గుర్తెరిగి ఉండాలి...

ఇట్లు,

భవదీయుడు,

వంశీ కృష్ణ కార్తీక్

1 comment:

విహారి(KBL) said...

mee abhiprayamto akeebhavistunnanu ani cheppalekunnanu kani meeru cheppindi nijam.