Monday, April 9, 2007

ఆలోచనలు

నేను చాలా రోజులు నుంచి ఆలోచిస్తున్నా…ఏమి ఆలోచించాలా అని ఆలోచిస్తున్నా..

ఆలోచనల మూలం ఎమిటా అని ఆలోచిస్తున్నా…అసలు ఆలోచనలు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తున్నా..ఇంతకీ మూలం దొరికిందా అంటే….దొరికిందనే చెప్పాలి….

సృష్తి స్థితి లయ కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ ఆలోచనలకన్నిటికి మూలము
అందుకే అన్నమాచార్యుల వారు అంటారు…

చిత్తములొ భావమెల్ల శ్రీ వేంకటేశుడే
హత్తిన ప్రకృతి యల్ల ఆతని మాయే
మత్తిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు
ఇత్తి దేహపు బ్రతుకు బ్రతికేటి వారికి ...

ఎంత చక్కగా చెప్పారండి....మన ఆలోచనల భావం ఆ శ్రీ వెంకటేశుడేనట....ఇక మిగిలిన ఈ భూప్రపంచం లోని ప్రాణులంతా ఆతను కల్పించిన మాయే....

ఈ ఒక్క ఫాట చాలాదా...ఇంకో కీర్తనలో,

భావములోన బాహ్యము నందున..
గోవింద గోవింద అని కొలువవో మనసా....

మనం మన భావములోను..అంటే ధ్యాన ప్రపంచం లోనూ అలానే ఈ బాహ్య ప్రపంచం లోనూ…ఆ గోవింద నామమే జపిస్తూ ఉండాలి…. అలా జపించినప్పుడే మనకి, పైన చెప్పినట్టుగా...ఆ ఆలొచనల భావం ఆ శ్రీవేంకటేశుడే అని అర్థం అవుతుంది,,,
ఉపన్యాసం ఇచ్చేస్తున్నానా?...ఏదో అన్నమాచార్య కీర్తనల మీద మక్కువ తొ ఇలా ఉదహరణ సహితంగా రాద్దామని అనిపించింది(ఇక్కడేమి ఉదహరణ ఇవ్వలేదు..వెతకకండీ)...

ఇట్లు భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్

No comments: