Friday, May 22, 2009

ఎటువైపు వెళ్తున్నాం...

21వ శతాబ్డం లో కాంతి వేగం తో దూసుకు వెళ్ళిపోతున్న ఈ ప్రపంచం లో, ఇంకా పాత రాతి యుగపు మాటలు ఎంటీ అని చాలామంది అంటూ ఉంటారు. ఒక్కసారి ఆ విషయాలను విశ్లేషిద్దాం. ప్రగతి అన్న మాటకి అర్ధం యేమిటి? మానశికంగా, సాంస్క్రుతికంగా, స్థితిపరంగా, వైజ్ఞానిక పరంగా ఉన్నత స్థాయి ని చేరుకోవటమే ప్రగతి.

మరి ఇవాల ఉన్నదేమిటీ? మొన్న నేను ఒక బట్టల దుకాణంకి వెళ్ళాను, అది ఈ భాగ్య నగరం లో చాలా పేరు ఉన్న కొట్టు, సెంట్రల్ అని ఉంది లేండి. సరే తీరా వెళ్ళానా, నేను వెల్తే వాడు సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడట్లేదు..నేను యెమైనా గతి లేక వచ్చా అనుకున్నడేమో అనిపించింది....ఇంతలో ఒకడు వచ్చాడు, పిల్లి గడ్డం , చెవికి ఒక ఫోగు, మోకాళ్ళ దగ్గర చిరిగిన పాంటు. వాడిని చూస్తేనే నాకు జలదరించింది.....ఇక ఈ షాపు వాడి హడావిడి చూడాలి, వాడిని పట్టుకుని వదలలేదు, యెంతో గౌరవం గా , వాడు అడిగిన వన్ని చూపించాడు. తెలిసిన వాడేమో అనుకున్నా, కానీ కాదట. అప్పుడు అనుకున్నా, వంటి నిండా బట్టలు కట్టుకోవటం కుడా తప్పేనా అని. ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అంటే, ఇవాల మన సమాజం లో, మన సంస్కృతి సంప్రదాయాలని పాటించే వారికి విలువ లేకుండా పొయింది.

నేను పని చేసేది ఒక పెద్ద కంపెనీలోనే, అక్కడ మనుషులు యెలా మాట్లాడతారంటే, వాళ్ళేదో పుట్టుక నించి ఆ విదేశీ పద్దతుల్లో పెరిగినట్టు, కనీసం మన బాష మీద గౌరవం కూడా లేనట్టు మాట్లాడతారు. ఫక్క జాతి మీద గౌరవం , ప్రేమ ఉండటం లో తప్పు లేదు, మన సంస్కృతి మీద అంత నిర్లక్షం పనికిరాదు.

మేము ఒక గుడి కట్టాము. నేను చందాలు అడిగితే, చాలమంది ఒక మాట అన్నారు. ఈ రోజుల్లో కూడా గుడీ, గోపురము యెంటీ అని..అసలు ఆ ప్రశ్న యేమిటో నాకు అర్థం కాలేదు. కాలం మారింది కదా అని అన్నం తినటం మానేశామా? తప్పించుకోటానికే అయి ఉండచ్చు, కాని ఈ రకమైన మాటలు సర్వ సాధరణమైపొయాయి.

తెలుగులో మట్లాడితే అదో నేరం. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందని, ఈ ఆంగ్ల బాష పిచ్చి వల్ల, మామూలు వాళ్ళు కూడా, అటు ఆంగ్ల బాషకి , ఇటు మాతృబాషకి దూరం అవుతున్నారు. ఈ టి.వి లో వచ్చే ఆడవాళ్ళ తెలుగు ఐతే భరించలేము. అసలు వాళ్ళు తెలుగుని ఇంత దారుణంగా విరిచేసి యెందుకు మాట్లాడతారో అర్థం కాదు. కాని విశేషం యెంటీ అంటే, ఇలా పిచ్చిగా మాట్లాడే వాళ్ళే ఆ టి.వి వాళ్ళకి నచ్చుతారు. స్పష్టంగా మాట్లాడే వాళ్ళు ఉన్నా వాళ్ళకి అవసరం లేదు.

ఇలా , కట్టుకునే బట్టల నించి, మాట్లాడే బాష దాక, అన్నీ కూడా, పక్క వాడిని చూసి అనుకరిస్తే, మన వ్యక్తిత్వం ఎందుకు? మన దేశం కళలకి పుట్టినిల్లు, అలాంటి ఈ దేశం లో, దక్షిణ భారతం ఈ కళలకి బాగా ప్రశిద్ధి. యెక్కడో పుట్టిన వాళ్ళు ఇక్కడకి వచ్చి సంగీతము, నాట్యము ఇత్యాది కళలు నేర్చుకుంటుంటే, మనం ఆ సాంప్రదయాల మధ్య పుట్టీ , అటూ పాశ్చాత్తానికి,ఇటు భారతీయతకు , రెండిటీకి దగ్గర అవలేక పోతున్నాం అంటే అది మన దౌర్భాగ్యమే.

మార్పు అవసరమే, కాని మన సంస్కృతి సంప్రదాయాలని సమూలంగా అంతం చేసే మార్పు వినాశకారిణి. ఈ పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. అక్కడికి వెల్లేవాళ్ళలో చాలా మందికి, ఆ ఖర్చు పెట్టే డబ్బు యొక్క విలువ తెలియదు. అమ్మయిలతో తిరగటమే స్వర్గం అనుకునే ప్రబుద్ధులూ ఉంటారు. అలానే వెంట అబ్బాయి లేనిదే రోజు గడవని అమ్మాయిలూ వున్నారు. ఇవన్నీ కూడా మన సాంప్రదాయం లో లేవు. పాశ్చాత్త దేశాలనించి తెచ్చుకున్న అలవాట్లే. యెక్కడైన మంచి నేర్చుకుని చెడు వదిలెయాలి. మనం చెడుని గ్రహించి మంచిని వర్జించటంలొ మొట్టమొదట ఉంటాము.

ఇంతా యెందుకు వ్రాశాను అంటే, కనీసం ఒక్కరైనా వాళ్ళ మనస్సాక్షి తో మాట్లాడి, మన సమాజం లో మన సంస్క్రుతి గొప్పతనం తెలియటానికి నెనేమైనా చేస్తున్నానా అని ఒక్క సారి ప్రశ్నించుకుంటారేమో అన్న ఒక్క చిన్న ఆశ.

ఇక ఉంటాను.

విధేయుడు...

వంశీ కృష్ణ కార్తీక్

vamsi.vallurik@gmail.com

9908527444

Monday, May 11, 2009

Laksha galarchana - My opinion

Sri Tallapaka Gurudeva Namo Namaste...
It was a good program. Seeing a crowd of 1,60,000 and being part of such event is an experience that can only be lived in. Ramanachari gari speach is too good where he emphasized the role of TTD in encouraging such activities. Its heartining to Know that the TTD has given the Cd's free of cost. Though TTD has said it didn't help silicon andhra financially, the very gift of offering CD is good enough as it involves good cost.
I was very happy when Sri Garimella Balakrishna Prasad garu started with a Song on Narasimha....Kadiri Nrusimhudu ....and then followed it up with Kanti Akhilanda Karta and Vedukondama. It was simple and lucid as people were rearing to go for singing the Saptagiri sankeertanas.
Once it started, it didn't Stop. All the 7 keertanas were sung with good interest, Bhakti and emotion. Personally I was very happy as they didn't sing in the pace they mentioned in the CD, it was original tunes that they followed. Garimella Balakrishna Prasad garu and his son Anil led the show well.
Once the show is complete the Guinness personal has announced that the record is broken and broken with considerable difference. It was a great achievement and the world record will stay on Annamacharyaa's Name. This was possible because of the efforts of Silicon Andhra and all the volunteers who worked day and Night to make this program a grand success. And the main credit goes to all the singers,participants without whom this record couldn't have been achieved.
3 cheers to all of them.,,,, Now coming to Cons....(this is totally a personal Opinion)
1. Since this is a music oriented program, probability of attendance of senior citizens is more. They should have kept a separate entrance for them. Same is the case with Handicaps.When I was entering, the lady next to me was very old and carrying some device to walk and the guy right to me was blind. I felt really bad as they should have been allowed from a Separate entrance.
2. No numbering. Lot of emphasis was done on registering for the event and sitting as per the slot awarded. This didn't happen . This has lead to lot of chaos.
3. I didn't find any Annamachayra Cut Out. I was really surprised. I am sorry if its there and I missed it, but I didn't find any such thing.

These things happen when such Herculean Programs are undertaken. I just mentioned them as I felt they could have done better in these.
I Would have been more critical had this been an event organized by TTD. They are masters in organizing crowd events. Since its a silicon Andhra event, considering the volume of people who have attended,the program is a GRAND SUCCESS.

Regards
Vamsi Krishna Karthik
vamsi.vallurik@gmail.com

Tuesday, February 10, 2009

అహొబిలం..












"అహొబిలే గారుడ శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం
లక్ష్మ్యా సమాలింగిత వామ భాగే లక్ష్మీ నృసిం హం శరణం ప్రపద్యే "


చాలా రోజులనించీ రాద్దామని ఇప్పటికి వ్రాయగలుగుతున్నా. ముందుగా ఆచార్యులకి నమస్కరించుకుంటూ


"శ్రీమద్రంగ శఠారిసమ్యవమిరాట్ లబ్దాంగమంతద్వయం
శ్రీమద్వీర రఘూద్యహద్య శఠజిత్ పాదార విందాశ్రయం
శ్రీమద్వేత వతంసదేసిక యతే: కారుణ్య వీక్షాస్పదం
సేవేరజ్గ దురీన శాశనవనం నారాయణం యోగినం
శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసిమ్హ దివ్య పాదుకా సేవక శ్రీవన్ శ్రీ నారాయన యతీంద్ర మహాదేశికాయనమ:"

అహోబిలం నవనారసిం హ క్షేత్రం. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కుర్నూల్ జిల్లా ఆల్లగడ్డ మండలం లో ఉంది. మన తెలుగు నేల మీద ఉన్న రెండవ దివ్య దేశం (మొదటిది తిరుమల). అహొబిల క్షేత్రం తెలుగు నేల మీద ఉన్నప్పటికీ, అక్కడ అంతా తమిళ సాంప్రదాయమే ఉండటం విశేషం .

ఒక సారి చరిత్ర లోకి వెళ్తే
సుమారుగా ఏడు వందల సంవత్సరాలకి పూర్వం, తిరునారాయణపురం లో ఉండే ఒక పంతొమ్మిదేండ్ల అబ్బాయికి కలలొ కనపడిన శ్రీలక్ష్మీనృసిమ్హు డు, అహొబిలం రమ్మని సెలవు ఇచ్చారట. ఆ అబ్బాయి వాళ్ళ ఆచార్యుల వద్దకు వెళ్ళి, ఆచార్య వర్యా, నన్ను ఇలా అహోబిలం రమ్మని శ్రీవారి ఆజ్ఞ అయ్యింది, సెలవ ఇవ్వండి అని ఆచార్యుల వద్ద సెలవు పుచ్చుకుని, దట్టంగా పెరిగి ఉన్న నల్లమల అడవుల మధ్య ఉన్న అహోబిల క్షేత్రానికి వచ్చారు. అక్కడ వేంచేసి ఉన్న నవ నారసిమ్హ దేవలయాలను దర్శించినారు..ఇంతకీ ఆ నవ నారసిం హులు ఎవరూ అంటే,ఒక శ్లోక రూపం లో మనం ఇలా అనుకోవచ్చు...

"జ్వాల అహోబిల మాలోల
క్రోఢ కారంజ భార్గవ
యొగానంద చత్రవట పావన
నారసిం హ నవ మూర్తయ... "

విశదీకరిస్తే,

1. జ్వాలా నరసిం హుడు
2 అహోబిల
నరసిం హుడు
3 మాలోల నరసిం హుడు
4. క్రోఢ నరసిం హుడు
5. కారంజ నరసిం హుడు
6. భార్గవ
నరసిం హుడు
7. యోగానంద నరసిం హుడు
8. చత్రవట నరసిం హుడు
9. పావన నరసిం హుడు

ఈ నవ నారసిం హ క్షేత్రాలు దర్శనం చేసుకుని, బసకి చేరి, నిద్రుస్తున్న ఆ బాబు కలలో, నరసిం హ స్వామి మరలా దర్శనమిచ్చి, నాయనా, నీవు శ్రీవైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసే కార్యక్రమాన్ని స్వీకరించాలి. అంతేకాక, నా ఉత్సవ మూర్తులలొ ఒక మూర్తిని నీతొ పాటు తిప్పాలి అని ఆజ్ఞాపించారు....ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏంటి అంటే, అహొబిలం లొ తొమ్మిది క్షేత్రాలు ఉండటం వల్ల, తొమ్మిది ఉత్సవ మూర్తులు ఉంటాయి....యే మూర్తిని తీసుకెళ్ళాలొ తెలియక ఈయన, ధ్యానం లొ కుర్చుంటారు. అప్పుడు, మాలోలన్ ఉత్సవ మూర్తి వచ్చి ఈయన వొల్లొ పడిందట. కాకతాళీయమో,భగవద్ కృపయో, మాలోలన్ ఉత్సవ మూర్తికి పాదుకలు ఉంటాయి. ఇది భగవత్ కృపయే..ఈయన సంచారం చేస్తారు
కాబట్టి, పాదుకలు అన్నమాట. అప్పుడు ఆ సన్నివేసాన్ని చూసిన ఆ ఆలయ నిర్వహణాధికారులు, ఈయన వద్దకి వచ్చ్చి, నమస్కరించి, గుడి భాద్యతలు చేపట్టవలసిందిగా కొరారు. అప్పుడు యేర్పాటు అయినదే, శ్రీ అహోబిల మఠం, లేదా శ్రీ మఠం. ఆ పంతొమ్మిదేండ్ల అబ్బాయే శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్రులు. అహోబిల మఠ పీఠానికి మొట్టమొదటి పీఠాధి పతి.ఈయన తనియన్ ఒకసారి అనుకుంటే

కేశవార్య కృపా పాత్రం ధీశమాధి గుణార్ణవం
శ్రీ శఠారి యతీశాంద్రం దేసికేంద్రం అహం భజే
ప్రపత్యె నివ్రాష్యద్యం నిషద్యం గుణ సంపదాం
శరణం భవ భీతానం శఠకోప మునీస్వరం
శ్రీమతే శ్రీ ఆదివన్ శఠకొప యతీంద్ర మహా దేశికాయ నమహ.

ఇప్పుడు ఉన్న పీథాధి పతి, అస్మదాచర్యులు, శ్రీ లక్ష్మి నృసిం హ దివ్యపాదుకా సేవక శ్రీవన్ శ్రీ శఠకోపశ్రీ నారయణ యతీంద్ర మహాదే
శికుల వారు 45వ పీఠాధి పతి.

అహొబిలం లొ హిరణ్య క
ప వధ జరిగినట్టుగా మనకి స్థల పురాణం చెప్తోంది. అక్కడ , స్వామి వారు ఉద్భవించిన, ఉగ్ర స్థంభం కూడా ఉన్నది. ఇక్కడ ఒక శ్లోకం చెప్పుకోవాలి, స్వామి వారు హిరణ్యకశపుని వధ చేస్తున్న సమయం లో, ఆయన గోళ్ళనే ఆయుధాలు గా వాడారు. ఆ పరాక్రమం చూసిన దేవతలు...

"అహోవీర్యం అహోసౌర్యం అహో బాహు పరాక్రమం
నారసిమ్హం పరం దైవం అహోబలం అహోబలం "

అని శ్రీనరసిమ్హుడిని పొగిడారట....

ఆళ్వారుల ప్రభంధాల పరంగ చూసుకుంటే, తిరుమంగయాల్వార్ గారు, అహోబిల నరసిమ్హుడి మీద పది పాసురాలు వ్రాశారు. సింగవెల్ కుండ్రం..అని ఆయన అంటారు.

సంకీర్తన పరంగా కూడా అహోబిలానికి చాలా ప్రాముఖ్యత ఉంది...శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు, అహోబిల మఠం శిష్యులు. వారు ఆదివన్ శఠగొపన్ గారి శిష్యులు. ఆదివన్ శఠగోపన్ గారి మీద అన్నమాచార్యుల వారు వ్రాసిన ఒక పాట...

చూడుదిందరికి సులభుడు హరి
తోడునీడ యగు దొరముని ఇతడు...

ఇందులొ, తన ఆచర్యులు విరజా నది మీద నావ లాంటి వారు అని సంబొధిస్తారు... ఆపాటలొ ఆఖరి చరణానికి వస్తే,

కరుణానిధి రంగపతికి కాంచీవరునకు వేంకటగిరి పతికి
నిరతి నహోబల నృకేసరికిని తత్పరుడగు శఠకొప ముని ఇతడు....

అని ముగిస్తారు. ఈ పాట చెప్పేస్తుంది మనకి, అన్నమాచార్యులవారి ఆచార్య భక్తి గురించి.
ఇక అలయాల విషయానికి వస్తే...
పైన చెప్పిన తొమ్మిదీ కాక, కింద అహొబిలం లొ, ప్రతిష్ట చేసిన లక్ష్మి నరసిం హుల వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ లక్ష్మి నరసిమ్హుల వారు, అమ్మవారిని తొడ మీద కుర్చోబెట్టుకుని కూర్చుని ఉంటారు...ఆయన కుర్చున్న విధం ఎల ఉంటుంది అంటే, దానిని కూడా అన్నమాచార్యుల వారు ఒక కీర్తన లొ ఇల వర్ణించారు:

ఆరగించి కూర్చున్నాడల్లవాడే
చేరువనే చూడరె లక్ష్మి నారసిమ్హుడు.

ఇందిరను తొడ మీద ఇనుకొని కొలువిచ్చి

అందపు నవ్వులు చల్లి అల్లవాడే
చెందిన మాణికముల శేషుని పడగ మీద

చెంది వరాలిచ్చె లక్ష్మి నారసిమ్హుడూ

బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద

అంగనల ఆట చూసి అల్ల వాడే
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాన

చెంగట నున్నాడు లక్ష్మి నారసిమ్హుడు

పెండెపు పాదము సాచి పెనచి ఒక పాదము

అండనే పూజ కొని అల్ల వాడే
కొండల శ్రీవేంకటాద్రి కోరి అహోబలమున

మెండుగాను మెరసి లక్ష్మీ నారసిమ్హుడు...

లక్ష్మి నరసిమ్హుడి దర్శనం చేసుకుంటున్నప్పుడు, ఆఖరి చరణo దాని అంతట అదే నోట్లోంచి వచ్చేస్తుంది అంటే అతిసయోక్తి కాదు.అంత అందంగా వర్ణించారు అన్నమాచార్యుల వారు.

ఆహోబిల నరసిం హుడు
===================
ఈ గుడికి వెళ్ళటానికి రహదారి ఉంది. ఒక యెభై మెట్లు ఎక్కితే సరిపోతుంది. అక్కడ ఉగ్ర రోపం లో కొలువై ఉంటాడు శ్రీ అహోబిల నరసిం హుడు. ఆలయానికి ఇదివరకటి ప్రవేశాన్ని మూసి వేశారు(వేరే ద్వారం ద్వారా ప్రవేశం ఉంటుంది) ఎందుకంటే, మాంసాహర నివేదన తీసుకుని ఆటవికులు వస్తున్నారట, అవును మరి వారి అల్లుడు కదా ఈయన (నరసిం హుడు). ఇక్కడ, చెంచులక్ష్మి అమ్మ వారు ఉంటారు. సుదర్శనాల్వార్ కూడా ఉంటారు.


జ్వాలా నరసిం హుడు
====================

ఈయనది జ్వాలా రూపం. జ్వాలా నరసిం హుడి గుడికి(గుడి అనేకన్న, గుహ అనాలేమొ) వెళ్ళాలి అంటే, చిక్కటి అడవిలో సుమారు ఒక 3కి.మి ప్రయాణం చెయాలి. మధ్యలొ
మనకి చిన్న చిన్న గుట్టలు, మనకి ఒక వైపు గరుడాద్రి, ఒక వైపు వేదాద్రి కొండలు వుంటాయి. అక్కడికి రాంగానే,

"గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె..." అనే అన్నమాచార్య కీర్తన గుర్తుకొచ్చేస్తుంది...
అలా నడుస్తూ ఉంటే, ఒక నది వస్తుంది. ఆ నది పేరే, భవనాసిని. మళ్ళీ ఒక కీర్తనలొకి వెళ్తే,

"భవనాసినీ తీర భవ్య నర కేసరి" ..అని ఒక కీర్తనలో, "భవనాసినీ తీర పంచాననం" అని ఒక చోట అన్నమాచార్యుల వారు ఆ భవనాసిని నది
యొక్క విసిష్టతని చెప్తారు. ఆభవనాసిని లొ పవిత్ర స్నానమాచరించి, ముందుకు వెళ్ళగా,వెళ్ళగా ,వెళ్ళగా, భవనాసిని జలపాతం వస్తుంది. ఆజలపాతం ప్రక్కనే ఒక నీటి గుంట ఉంటుంది. అక్కడే స్వామి వారు గోళ్ళు కడుక్కున్నారట, ఆ నీరు ఎంత తీపో నేను చెప్పలేను. అది త్రాగి చూస్తే మీకె తెలుస్తుంది. ఆ జలపాతం దాటుకుని వెల్లగా,(చిన్న జలపాతమే) అక్కడ కొలువై ఉన్నాడు, శ్రీ జ్వాలా నరసిం హుడు. ఆష్తభుజాలతో, జ్వాలారూపుడై ఉన్నాడు. ప్రక్కనే రెండు ప్రతిష్ట విగ్రహాలు ఉంటాయి. అక్కడినించి వెనక్కి తిరిగి చూస్తే, కనిపించే ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతం. ప్రస్తుతం జీయర్ గారి పర్యవేక్షణలో ఈ ఆలయానికి ఇనప కటకటాలు యేర్పరచ బడ్డవి.

మాలోల నరసిం హుడు
======= =====

మాలోల అంటే, మా = లక్ష్మి, లోల=లోలుడు , మాలోలన్ అంటే, లక్ష్మీ లోలుడు అని అర్థం. అహోబిలం జీయర్ గారితో పాటు తిరిగేది ఈ మాలొలన్ ఉత్సవ మూర్తియే. ఎంతో
అందంగా ఉంటారు స్వామి వారు. జ్వాలా నరసిం హుడి నించి ఒక 2 కి.మి ఉంటుంది . ఇదికూడా అడవి మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం జీయర్ గారి పర్యవేక్షనలొ, ఈ ఆలయనికి గొపురం కట్టించ బడింది.

క్రోఢ నరసిం హుడు
======= ===
ఈయన భూవరహా నరసిం హ అవతారం. అమ్మవారు భుజం మీద ఉంటారు(భూమాత రూపంలో).అహోబల నరసిం హుడి దగ్గర్లోనే ఈ క్రోఢ నరసిం హుని ఆలయం ఉంటుంది..



కారంజ నరసిం హుడు
========== ==

ఫాల నేత్రాణల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసిం హా....
ఈ పాట చాలా మంది వినే ఉంటారు. ఐతే, నరసిం హ స్వామికి ఫాలనేత్రము ఎమిటో ఆలొచించారా? ఫాల భాగము అంటే, నుదురు భాగము. అందుకే శివుడిని ఫాలాక్షుడు అంటారు. ఐతె, మరి ఫాల నేత్రాణల అని నరసిం హుడిని ఎందుకు పిలిచినట్టు అన్నమాచార్యుల వారు? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి అంటే,కారంజ నరసిం హుడి దర్శనం చేసుకోవాలి. ఈయన ఫాలాక్షుడు. అంతేకాక, చేత ధనుర్భాణాలతో వెలశాడు. ఇక్కడ కి వెళ్ళినప్పుడు, మేము అందరం(అక్కయ్య,అమ్మ, నేను బావగరు) ఫాలనేత్రాణల, కదిరి నృసిం హుడు పాటలు పాడాము. ఈ రెండుపాటలలోనూ, ఫాలనేత్రం గురించి అన్నారు అన్నమాచార్యుల వారు.

భార్గవ నరసిం హుడు
============


ఇక్కడికి వెళ్ళాలంటే, మాములు వాహనాలలొ కుదరదు. ఇది కూడ అడవి మధ్యలో ఉంటుంది. ఆటో, లేదా జీప్ లో వెల్లాలి.

యోగానంద నరసిం హుడు
========= ======

హిరణ్యకశపుని వధ జరిగిన పిమ్మట, స్వామి వారు శాంతించి కొంతకాలం, యొగావస్థలోకి వెళ్ళారట, ఆ మూర్తి ఇక్కడ వెలిసింది. ఇక్కడికి నేరుగా మనం వాహనం లో వెళ్ళవచ్చు. క్రింద అహోబిలం నించి,ఒక 4 కి.మి.

చత్రవట నరసిం హుడు
============

యొగానంద నరసిం హుడి దగ్గరికి వెళ్ళే దారిలోనే, కుడివైఫు కి తిరిగితే, అక్కడ నల్లగా నిగ నిగ లాడుతూ, చత్ర వట నరసిం హుడు దర్శనమిస్తాడు. ఈయన, సంగీత భంగిమలో, తాళం వేస్తూ ఉన్న చేతితో ఉంటారు.
పావన నరసిం హుడు
======== ====
ఈయన శాంత మూర్తి. చెంచు లక్ష్మిని వివహమాడి , చెంచుల గూడెం లోనే వెలిసినాడు. ఈ చెంచులక్ష్మి మీద, అహోబిల మఠం 5వ జీయర్ గారు ఒక పుస్తకం వ్రాశారు.ఇక్కడ కొన్ని సార్లు, మాంసాహర నివేదన జరుగుతుంది. సిమ్హం కద...


నాకు తెలిసినంతగా నేను పైన నవనారసిం హుల గూర్చి చెప్పాను. అహోబిల దర్శనం కలగటమే అదృష్తం. అన్నమాచార్యుల వారి మాటల్లోనే అనుకుంటే,

అగు శ్రీవేంకట మహోబలం
అగమ్య మసురులుకహోబలం
అగపడు పుణ్యులకహోబలం
అగికులరజన్ అహోబలం.....

అహోబిలం నరసిం హుల వారిమీద అన్నమాచార్యుల వారు కొన్ని వందల(వేల) కీర్తనలు వ్రాశారు. ఆయన దయ వల్ల, నాకు కూడా అహోబిల దర్శన భాగ్యం
కలిగింది. ఇంకా వ్రాయాలని ఉన్నా, ఇంతటితో ముగిస్తున్నాను.
నాకు ఈ రకంగా ఇక్కడ వ్రాయటానికి శక్తినిచ్చిన ఆచార్యుల పాదాలకి శత సహస్ర వందనాలు సమర్పించుకుంటూ......

విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్

Tuesday, May 20, 2008

Annamacharya 600th(shacchata) jayanti


Annamacharya Jayanti...No words to describe..

hi all,

It was a wonderful journey for us to the home village of Sri Tallpaka Annamacharya..
We are lucky to be present there and witness one of the finest executions of a great project.

Sravan, Prasad garu and Myself , first entered rajampet and found that town to be in a festive mood.. Every house, Every shop, and everyone geared up to the occasion. Where ever we see, there are banners. Pick of them are the rangavallis on mother earth..they are simply superb..everywhere you go, its SANKHAM, CHAKRAM AND NAMAM,...

Then came the lord of Seven Hills...Malayappa was brought to Tallapaka for Tirumanjana seva, and we are lucky to see him from very closet. I Never thought that, i will be able the utsava moorthy of sri venkateswara from such a short distance..its just fantastic....


Then we saw many biggies..
petadhipaties..including ahobilam jeeyar
Sri bhuman karunakara reddy, Ramanachari,Manjubhargavi.etc etc

In summary, manjubhargavi ninchi malayappa daaka, andarini cover chesaam

Then for some distance we travelled by Bus, and sang sankeertanas inside the bus..,
We landed where the entire event was happening, and the first sight of the stage drew our breath away....

That great man, whose sankeertanas we have been singing for all these years...That great mans sankeeertanas that has brought new trend to the sahityam ..seeing 108 Feet statue of that great immortal personality is something that should be experienced as i am getting short of words at this juncture..

It was simply an amazing statue and every inch of it is royal....

we somehow found some good place, near to the start and then the sankeertana goshti has started....

600 Artists, from different places across India and abroad have come to perform on this occasion...This includes sri Balakrishna prasad garu, the great maestro.
The following songs were sung :

1)Bhavamulona
2)Brahma kadigina
3)Podagamtimayya
4)Kondalalo
5)Enta matramuna
6)Muddugare yasoda
7) Narayanate namo namo
....

All the peetadhipatis gave mangalasanas to the occasion and spoke about sri Annamacharya...How pancha samskaram was done to him and all.. it was good.

There was a flower exhibition and photo exhibition organized by Tirumala Tirupati Devasthaanams(TTD). It was good.

Food was arranged for all the people who have come there..and it included the local sangati..which was quite good..may be thats why Annamacharya included this in one of his songs...
anganalandaru ati vedukato
sangati danchedarolaaala

After taking lunch, we just relaxed till evening/..In the interim, a songs CD was released,that is having songs sung by smt jyotirmayee

In the evening, we went inside Tallapaka village and visited sri Chennakesava Swamy temple, Sri Tallapaka Annamacharya temple...They were very nice..It was a wonderful feeling to visit the hometown of sri Annamacharya...that village itself is a scenic beauty..

We walked from there to the place where event was happening..and Tiruamanjana seva was performed to sri Malayappa ...May be Sri Tallapaka Annamacharya has wished that Malayappa visit his home town and bless the people there..that was Fulfiled yesterday as Tirumanaja Seva to the lord of seven hills was performed in Tallapaka amid more than 20K people..It was fascinating...

Then came the real fun..Fire works.
Different varieties of fireworks were fired...Almost all of them, once reaching the top, coming down as flowers to sri Tallapaaka Annamacharya statue... It was a scene that took our breath away..wonderful execution.

Then there was kacheri of 2 maestros on same vedika..Sri Nedunuri Krishnamoorthy garu..and Sri Garimella Bala krishna prasad garu..
Unfortunately, we couldn't witness the whole of kacheri, due to time constraints , we had to catch our train back at 9..so we came back to station..and that's how the trip was concluded......

In summary, I am happy to be part of this event, and I feel this will be undoubtedly the best thing that could have happened in my life...

The entire project was executed with perfection in every stage and hats off to TTD to organize such an event. Every year, Aradhanotsavams will be performed in tallapaka and hopefully, we'll see more such events in near future...

Venkataadri samamsthaanam brahmande naaastiknchana.....TTD has proved that...

Venkatesa Samaudevo nabhuto nabhavishyati....Annamacharya has proved that...

Photos for the same can be accessed at
http://picasaweb.google.com/vamsi.vallurik/TallapaakaAnnamacharyaShacchat600JayantiUtsavaalu

Jai Srimannarayana....
Vamsi Krishna Karthik
vamsi.vallurik@gmail.com

Wednesday, April 9, 2008

ఉగాది...నిజంగానే ఉగాదా?

ఉగాది...

ముందుగా మిత్రులందరికి సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు
ఇక విషయానికి వద్దాం..ఉగాది అంటే యేంటి? మొన్న మా మిత్రుడు అంటున్నాడు...యుగ+ఆది..యుగాది కాస్తా ఉగాది అయింది అని.,.కావచ్చు..నాకు తెలియదు..నాకు తెలిసినంత వరకు ఉగాది అంటే, ఉగాది పచ్చడి తింటమే ..హిహి


ఉగాది మనకి చాలా ముఖ్యమైన పండగ...సంవత్సరాది అని కూడా అంటాం. అందుకే,.ఆది పండుగ అనమాట..మనం, అంటే ఆంధ్రులం పాటించేది చాంద్రమాణం. చాంద్రమాణం ప్రకారంగా, ఉగాది నాటి నించి, చైత్ర మాసం ప్రారంభం అవుతుంది.....భగవన్నామం చేసుకుని , ఉగాది పచ్చడి తిని, పెద్దలకు నమస్కరించి, ఒక చిన్న సాహితీ గోష్టీ యెర్పాటు చేసుకోవటం, ఉగాది పండుగ కు మనం చేయవలసిన పని..కాని చేసామా?


జిడ్డు వదులుతుందిలే అని తలంటి పొసుకున్నాం,,,అమ్మ తిడుతుంది అని, దేవుడికి దండం పెట్టుకున్నాం..పెద్దలకి నమస్కరించటం మన రక్తం లోనే లేదు..ఇక సాహితీ గోష్టి అంటారా, సాహిత్యం అనగానేమి?
నేను కొంచం అతికి పోయి, మా ఇంటి దగ్గర ఒక పెద్దాయన ఉంటే, పట్టు బట్టి సాయంత్రం అందరం కలుద్దాం, యేవో తెలుగులొ నాలుగు మాటలు మాట్లాడుకుందాం అని ఆయన్ని వొప్పించాను...సాయంత్రం అయింది, నేను మైక్, స్పీకర్స్, అన్నీ పెట్టాను...చిన్ని చిన్ని పిల్లలు వచ్చి నా దగ్గరికి మేము డాన్స్ చేస్తాం అన్నరు..వాళ్ళని నిరుత్సాహ పరచటం ఇష్టం లేక, సరే అన్నాను..అప్పటి మొదలు రాత్రి తొమ్మిదన్నర దాకా పిల్లలందరు హిందీ పాటలకి పిచ్చి గంతులు వేసారు...


చివరికి నాకు విసుగు పుట్టి, ఒక బామ్మ గారి దగ్గరికి వెళ్ళి, పద్యాలు చదవమన్నా...ఐదు నిముషాలలొ పిల్లలు, పెద్దలు అందరూ వెళ్ళిపోయారు...అప్పుడు అనిపించింది..అసలు వీళ్ళకి ఉగాది అంటే ఏంటో తెలుసా అని...పిల్లలకి నాలుగు మంచి ముక్కలు నేర్పటానికి కూడా పెద్దలకి మనసు రావటం లేదేంటో అర్థం కావట్లేదు..ఏదో వచ్చాం, వెళ్ళాం
అని ఉండేట్టుగా ఉంటే అసలు ఎందుకు పండగలు చేసుకొవటం..ఇంట్లో అమ్మను, అమ్మ అని, నాన్నగారిని నాన్నగారని, పిలిచే రోజులు యేనాడో పొయినాయి. కనీసం పండగ పూట అన్నా నాలుగు తెలుగు మాటలు మాట్లాడతారేమో అని చూస్తే..అబ్బే, లేదుగా...వాళ్ళకి కావల్సిందల్లా ఆ కాసేపు అలా అలా కాలక్షేపం చేయటం...తెలుగు పండగ అని డాబులు కొట్టుకుని, తెలుగు పద్యం వినగానే లేచిపొయిన వాళ్ళకి అసలు ఉగాది జరుపుకునే హక్కు ఉందంటారా?

విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్
vamsi.vallurik@gmail.com

Thursday, March 13, 2008

అన్నమాచార్య కీర్తనలను, వారు రాసిన సాంప్రదాయంలో వినండి

నమస్కారం,


నాకు అన్నమాచార్య కీర్తనలు అంటే యెనలేని గౌరవం. నేను ఆయన్ని నాకు గురువుగా భావిస్తాను.ఆయన కీర్తనల ప్రభావం నా జీవితము పై బాగా ఉంది. మన జీవితపు క్రమంలో జరిగే ప్రతీ సన్నివేశాన్ని, ఒక అన్నమాచర్య కీర్తనలొ మనం చూదచ్చు...

నాలుగు వేదాలని, ముప్పది రెండు వేల సంకీర్తనలుగా మలచి, మన మానవాళికి అందించిన మహనీయుడు ఆయన..ఎన్ని చెప్పినా, యెంత పొగడినా, ఆయనకి తక్కువే.

ఆయన, శ్రీ రామనుజ సాంప్రదాయం అనుసరించి, శ్రీనివాసుని చేరే క్రమంలో రాసిన కీర్తనలు, వారికి శ్రీ వేంకటేశ్వరుని యందు ఉన్న అచంచల మైన భక్తి ప్రపత్తులను చాటుతాయి. అంతే కాక సాంప్రదాయం పట్ల ఉన్న భక్తిని, విశ్వాసాన్ని కూడా చాటి చెప్తాయి...

మచ్చుక్కి ఒక రెండు వరుసలు అనుకుందాం..


నీవలన కొరతేలేదు మరి నీరు కొలది తామరము
ఆవల భాగీరధీ నది దరి బావుల ఆ జలమే ఊరిన యట్లు
శ్రీ వేంకట పతి నీవైతే నను చేకొని యున్న దైవము..
నీ వలనే నీ శరణనియదను ఇదియే పరతత్వము నాకు....

చాలదాండి ఈ పాట? యెంత మాత్రమున యెవ్వరు దలచిన అంత మాత్రమే నీవు....ఈ వరుసకి ఉన్న గొప్పదనన్ని, ఇంత సరళీకృత భాష లో యెవ్వరూ రాయలేరు, రాయలేదు, రాయబోరు..

అన్నమాచార్య కీర్తనలను వినేవారికి, ఒక్క విన్నపం...గురువుగారు రాసిన కీర్తనలను,వారి సాంప్రదయాన్ని గౌరవించి వింటేనే, మనకి వాటి మూలార్థం గోచరిస్తుంది...

విన్నామా, అని వింటే అర్థం కాదు,,,ఇప్పుడున్న ఇంకొక పెద్ద ముప్పు యేంటంటే, వీరి కీర్తనలను విశ్లేషించేవాళ్ళు, విశిష్తాద్వైత వ్యతిరేకులు...(ఇంకో బాషలో చెప్పాలంటే అద్వైతులు)...మరి వారికి నచ్చని సాంప్రదాయాన్ని వారు విశ్లేషిస్తుంటే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి...
మనసులో ఉన్న బాధ బయట పెట్టుకోగలిగాను...

అద్వైతులు యుద్ధానికి వస్తారేమో చూడాలి

జై శ్రీమన్నరాయాణ
భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్

vamsi.vallurik@gmail.com

Friday, February 29, 2008

తెలుగులో సంభాషించండి.....

సభకి నమస్కారం,
రోజు రోజుకీ, తెలుగులోనే మాట్లాడాలి అన్న కాంక్ష ఎక్కువైపోతోంది..ఎందుకా అని ఆలోచిస్తే తెలిసింది,..మన చుట్టూ ఉన్న వాళ్ళళ్ళో తెలుగు మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. పోనీ వాళ్ళకి తెలుగు రాదా అంటే, తెలుగు బిడ్డలే..ఇలా ఎందుకా అని ఆలోచించినా, సమాధానం దొరకలేదు. కాకపోతే, ఇలా పోతే మన బాష ఎమైపోతుందా అని బాధ అంతే.


తెలుగుకి ఉన్న అందం, మాటల్లొ చెప్పలేనిది. అది కేవలం అనుభవించాలి...మన తెలుగు జాతిని ఉద్దరించిన మహానుభావులలో, పద కవితా పితామహ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అగ్రగణ్యులు. వీరే కాదు, కీర్తనా పరంగా తీసుకుంటే , శ్రీ త్యాగరాజుల వారు, రామదాసు గారు, క్షేత్రయ్య గారు . సాహితీ పరంపర అయితే ఇంక చెప్పేదేముంది, ఆంధ్ర కవితా పితమహ అల్లసాని పెద్దన్న గారు,ఆదికవి నన్నయ్య భట్టారకుడు, తిక్కన్న సోమయాజి, యెఱ్ఱాప్రగ్గడ, మధురకవి నంది తిమ్మన్న, విశ్వనాథ సత్యన్నారయణ, ఇలా ఒకరేమిటి, తెలుగు సాహితీ సంపదకి ఎనలేని ఐశ్వర్యాన్ని తెచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు..


ఇవన్నీ ఎందుకిప్పుడూ అంటే, సమాధానం చాలా సులభంగా ఇవ్వచ్చు. మనం మన బాషకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం లేదు. ఇళ్ళ దగ్గర అమ్మలు, పక్క వాళ్ళతో అనే మాటలు ఇలా ఉంటాయి, "మా అబ్బాయి తెలుగు లో చాలా weak అండీ" ..ఈ మాట ఆవిడ చాలా మురిసిపోతూ చెప్తుంది,ఎందుకంటే , తెలుగు సరిగ్గా రాదు అంటే, అదో గొప్ప. వాడికి కేవలం ఆంగ్లం వచ్చన్నమాట. అవును వాడికి తెలుగు యెలా వస్తుంది? ఇంట్లో వాళ్ళెప్పుడూ, ఆంగ్లం లోనే మట్లాడితే. దీనిమూలంగా మాకేమి నష్టం అని అడగ వచ్చు. లేదు, అతనికి/ఆమెకివచ్చిన నష్టం లేదు, కాని, తెలుగు బిడ్డలు అయి ఉండీ, తెలుగు ని గౌరవించలేనప్పుడు, మన బాషకి వాళ్ళు తీరని నష్టాన్ని తెస్తున్నట్టే.


యెలా అంటారా, కనీసం తెలుగు మాట్లాడలేని వాళ్ళు, రేపు,తమ పిల్లలకి తెలుగుని ఎమి నేర్పుతారు? ఎందుకు, మనలొనే తీసుకుందాం,

యెవ్వాని వాకిట నిహమద పంకంబు రాజ పూజిత రొజొ రాజినడగు
యెవ్వాని చారిత్ర మెల్ల లొకములకు నొజ్జ యై వినయంబు నొరపుగొరపు
యెవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూడ్ద్కి మానిత సంపదలీనుచుండు
యెవ్వాని గుణలతలేడు వారాసుల, కడపటి కొండ పై కలయ బ్రాకు
అతడు భూరిప్రతాప మహా ప్రదీప దూరవికటిత గర్వాంధకార వైరి వీర కోటీర
మని ఘని వేష్తితాంగినలుడు, కేవలమత్యుడె ధర్మసుతుడు..


అసలు ఇవాల్టి వాళ్ళు ఈ పద్యానికి అర్థం చెప్పగలరా? తిక్కన భారతం లోని విరాట పర్వం లోని పద్యం. నాకు తెలిసిన ఒక్క పద్యమెదో రాశేసి ఎదో అనేస్తున్నా అనుకోవద్దు.నేను ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాను. మన బాషని మనమే అర్థం చేసుకోలేని పరిస్థితులలొ ఉంటే, ఇంక మిగతా వాళ్ళకి మన బాష మీద గౌరవం ఎక్కడినించి వస్తుంది? తెలుగు జాతి కన్నట్టి ముద్దు బిడ్డలమై ఉండి, మన ఖర్మ కాలి, తెలుగు లో సంభాషించుకోలేక పోతున్నాం.

అదేదొ,చిత్రం లో ఒక పాట ఉంటుంది, అన్ని బాషలని నీవు అభిమానించు(నాకు గుర్తులేదు), మాతృ బాష లోనే నీవు సంబాషించు అని..

అన్నమాచార్యులు పుట్టి, ఉద్దరించిన గడ్డ మీద, దయచేసి, రొజూ, ఇంట్లో అన్నా తెలుగులో మాట్లాడండి. తెలుగు తల్లి గౌరవాన్ని కాపాడండి.

ఎందరోమహానుభావులు అందరికీ వందనం
వంశీ కృష్ణ కార్తీక్ వల్లూరి